
RBI కొత్త రూల్స్, లోన్ రికవరీ ఏజెంట్లు వేధిస్తే జైలుకే!
Web desc : అప్పు తీసుకున్న వారిని వేధించే రికవరీ ఏజెంట్ల ధోరణికి ముగింపు పలకాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయించింది.
రుణ వసూలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, మర్యాదపూర్వకమైన పద్ధతిలో నిర్వహించేలా ఫిబ్రవరి 12, 2026న కీలక సవరణ ఆదేశాలను విడుదల చేసింది.
ఈ కొత్త నియమాలు జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. దీనిపై మార్చి 6లోపు ప్రజల నుండి అభిప్రాయాలను కోరింది.
ఇకపై ఎవరిని పడితే వారిని రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి బ్యాంకులకు వీలుండదు. కొత్త నిబంధనల ప్రకారం, రికవరీ ఏజెంట్లు ఖచ్చితంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) నిర్వహించే డెట్ రికవరీ శిక్షణ పూర్తి చేసి, ధృవీకరణ పత్రం పొందాలి.
బ్యాంకులు తమ ఏజెంట్ల నియామకానికి ముందు వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
వేధిస్తే కఠిన చర్యలు: RBI రుణ గ్రహీతల గోప్యతను గౌరవించడంపై ఆర్బీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఏజెంట్లు నిర్ణీత సమయాల్లో మాత్రమే బాకీదారులను సంప్రదించాలి.
అకాల సమయాల్లో కాల్స్ చేయడం, అసభ్య పదజాలం వాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తే సదరు బ్యాంకులపై కఠిన చర్యలు ఉంటాయి.
వసూలు ప్రక్రియలో కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఏజెంట్లకు అందించాలి తప్ప, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఫిర్యాదు పెండింగ్లో ఉంటే రికవరీ ఆపాల్సిందే! ఒకవేళ రుణ గ్రహీత బ్యాంకుకు లేదా ఏజెంట్ ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు సదరు కేసును ఏజెంట్కు అప్పగించకూడదు.
అంటే, ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న సమయంలో రికవరీ చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంకులు తమ ఉద్యోగులు మరియు ఏజెంట్ల కోసం ప్రత్యేక ‘ప్రవర్తనా నియమావళి’ ని రూపొందించుకోవాలి.
TRAI నిబంధనలు కూడా అమలు . బ్యాంకులు ఆర్బీఐ ఆదేశాలతో పాటు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను కూడా పాటించాలి.
వాణిజ్యపరమైన సమాచారం అందించేటప్పుడు టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ రెగ్యులేషన్స్ (2018) నియమాలను ఉల్లంఘించకూడదు. ఈ సవరణల వల్ల అప్పులు వసూలు చేసే క్రమంలో ఉండే అనవసర ఒత్తిడి, వేధింపులు తగ్గి, రుణ గ్రహీతలకు చట్టపరమైన భరోసా లభించనుంది.



