
మాతృభాష దినోత్సవ వేడుకల్లో… ప్రముఖ కవి రచయిత డాక్టర్ కందుల సుధాకర్ కు ఘన సత్కారం
సికే న్యూస్ ప్రతినిధి
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన “మాతృభాష వేడుకల్లో ” ఖమ్మం జిల్లా నుండి ప్రముఖ కవి రచయిత నటుడు డాక్టర్ కందుల సుధాకర్ పాల్గొని” తస్మాత్ తెలుగోడా! అనే కవిత ఆలపించారు దీనికి గాను తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్ డి విల్సన్ మరియు ప్రపంచ కవుల వేదిక సంస్థ నిర్వాక అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ చేతులమీదుగా ప్రశంసపత్రం మరియు మూమెంటో అందుకున్నారు
కవి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ మాతృభాష దినోత్సవం పురస్కరించుకొని తెలుగు భాష పుట్టుక గొప్పదనం వివరించారు
ఆయన ఖమ్మం జిల్లా ప్రజలకు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ముత్తవరపు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.




