
జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి పై, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ ఆగ్రహం..
మాదిగ సామాజిక వర్గానికి చెందిన గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అలేఖ్య ని అగ్రకుల నాయకులు “నువ్వు మాదిగ కులానికి చెందినవే” అంటూ అవమానకరంగా దూషిస్తూ గ్రామంలో ప్రచారం చేస్తున్న ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసుల నుండి ఎటువంటి స్పందన లేదంటూ వచ్చిన పిర్యాదుపై హుస్సేన్ నాయక్ మండిపాటు…
దళిత ప్రజాప్రతినిధిని కులం పేరుతో అవమానించడం అత్యంత తీవ్రమైన నేరమని, ఫిర్యాదు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని సిఐ పై అసహనం వ్యక్తం చేసిన హుస్సేన్ నాయక్..
వెంటనే కేసు నమోదు చేసి రెండు గంటల్లో ధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బాధితురాలికి న్యాయం జరిగే వరకు కమిషన్ పర్యవేక్షణ కొనసాగుతుందని సిఐ ని హెచ్చరించిన హుస్సేన్ నాయక్…



