
దుబాయ్లో చిక్కుకున్న మంత్రి తుమ్మల
Web desc : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు జరగడం, తదనంతర పరిణామాలతో అక్కడి ప్రభుత్వం విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. కుటుంబ సభ్యుడి చికిత్స కోసం ప్రయాణం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐదు రోజుల క్రితం తన కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం కారణంగా, మెరుగైన చికిత్స నిమిత్తం దుబాయ్ వెళ్లారు. చికిత్స ముగించుకుని తిరిగి రావాల్సి ఉండగా, ఈ లోపే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.
రద్దైన విమాన సర్వీసులు : దుబాయ్ ఎయిర్పోర్టు లక్ష్యంగా దాడులు జరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి అధికారులు అన్ని సర్వీసులను రద్దు చేశారు.
రన్వేలు మరియు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ వచ్చే వరకు విమానాలు నడిచే అవకాశం లేకపోవడంతో, మంత్రి తుమ్మల మరియు ఆయన కుటుంబ సభ్యులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.



