
“నిజం చెప్పే ధైర్యం లేని వ్యక్తులు సమాజానికి పెద్ద ముప్పు.”
–డా. పీటర్ నాయక్ లకావత్,
(ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్)
సికె న్యూస్ ప్రతినిధి
ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరిగేవారు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేని వారు. తమ తప్పులను ఒప్పుకోవడం రాక, బాధ్యత తీసుకోవడం రాక, అబద్ధాల వెనుక దాక్కొని బ్రతకడం వారి అలవాటుగా మారిపోతుంది.
ఇలాంటి వ్యక్తులు తమ బలహీనతను దాచుకోవడానికి ఎన్నో మార్గాలు వెతుకుతారు. కానీ నిజం ఒక రోజు బయటపడకుండా ఉండదు. నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఎంత ఎక్కువైతే, వారి వ్యక్తిత్వ పతనం అంత స్పష్టంగా కనిపిస్తుంది. నిజమైన ధైర్యం ఉన్న వ్యక్తి చేసిన పనికి సమాధానం చెబుతాడు.
తప్పు జరిగితే దాన్ని ఒప్పుకుంటాడు. అదే నిజమైన ధైర్యం, అదే నిజమైన పౌరుషం. ఆత్మగౌరవం ఉన్న మనిషి ప్రశ్నల నుండి పారిపోడు. కానీ సిగ్గు, బాధ్యత, నైతికత లేని వారు మాత్రం సమాజంలో తిరుగుతూ, మాట తప్పిస్తూ, తమ నీచత్వాన్ని తామే బయటపెడుతుంటారు.
“చివరికి సమాజం గౌరవించేది అబద్ధం చెప్పేవారిని కాదు – నిజం కోసం నిలబడే వారినే.
నిజం నుండి పారిపోవడం పిరికితనం. నిజం ముందు నిలబడటమే నిజమైన పౌరుషం.”



