
విద్యుత్ షాక్తో పంచాయతీ కార్యదర్శి మృతి
ఏన్కూర్ మండల పరిధిలోని తిమ్మారావుపేట గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న లకావత్ సురేష్ తన ఇంట్లో విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు.
ఆయన మృతి పంచాయతీ కార్యదర్శులు సంఘానికి తీరనిలోటని ఏన్కూరు మండల పంచాయతీ కార్యదర్శిల సంఘం నాయకులు విచారం వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో భాగంగా తమతో నిత్యం కలిసిమెలిసి ఉంటూ పలు కార్యక్రమాల్లో సురేష్ చురుకుగా పాల్గొనడం, పంచాయతీ కార్యదర్శిగా తిమ్మారావుపేట గ్రామస్తుల అభిమానం చూరగొన్న లకావత్ సురేష్ మృతి తీరని లోటని పేర్కొన్నారు.
సురేష్ మృతి పట్ల మండల ఎంపీఈఓ, జివిఎస్, నారాయణ, ఏన్కూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ధీరావత్ సందీప్ నాయక్, పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు సంతాపం తెలిపారు.




