
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్కి దేహశుద్ధి..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులకు తెలపింది. వారు హుటాహుటిన కాలేజీ ప్రాంగణంలోకి వెళ్లి.. ఆ వ్యక్తి పై దాడికి ప్రయత్నించారు.
దీంతో ఘటన స్థలానికి సత్తుపల్లి పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



