HealthKhammamTelangana

టెక్నీషియన్​ లేక ..2డీ ఎకో మిషన్​ మూలన!

టెక్నీషియన్​ లేక ..2డీ ఎకో మిషన్​ మూలన!

టెక్నీషియన్​ లేక ..2డీ ఎకో మిషన్​ మూలన!

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​లో 2డీ ఎకో మిషన్ మూలన పడింది.
లక్షలు పెట్టి కొన్న మిషన్​ను టెక్నీషియన్​ లేరనే సాకుతో ఏర్పాటు చేయకుండా మూలకే పరిమితం చేశారు.

జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెంలోని గవర్నమెంట్​జనరల్ ​హాస్పిటల్​లోని డయాగ్నోస్టిక్​ సెంటర్​లో మొదటి సారిగా 2డీ ఎకో మిషన్​ ఏర్పాటు చేస్తున్నామని గతేడాది అప్పటి హెల్త్​ మినిస్టర్​ హరీశ్​రావు ప్రకటించారు.

2డీ ఎకో మిషన్​తో ఇక గుండె జబ్బు బాధితులు ఖమ్మం, వరంగల్ హైదరాబాద్​ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెప్పడంతో జిల్లా ప్రజలు సంబరపడ్డారు. కానీ నెలలు గడుస్తున్నా మిషన్​ను మూలకు పెట్టారే తప్ప ఏనాడు ఉపయోగించింది లేదు.

దాదాపు రూ.40 లక్షలకు పైగా ఖర్చు పెట్టి తెచ్చిన మిషన్​ టెక్నీషియన్​ లేక నిరుపయోగంగా మారింది. మరో వైపు కార్డియాక్​ డాక్టర్​ వస్తారంటూ ఏడాది కాలంగా వైద్యాధికారులు చెబుతున్నారనే తప్ప డాక్టర్​ వచ్చింది మాత్రం లేదు.

ప్రైవేట్​లో వేలల్లో ఖర్చు.. జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటల్​లో 2డీ ఎకో మిషన్​ లేకపోవడంతో గుండె జబ్బు బాధితులు రూ. వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్​ డయాగ్నోస్టిక్​​ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

ఖమ్మం, హైదరాబాద్​ వెళ్లలేక ఇబ్బంది పడుతున్నామని గుండె జబ్బు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం రావడంతో ఇప్పటికైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు 2డీ ఎకో మిషన్​ అందుబాటులోకి తచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button