
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు అక్కడిక్కడే మృతి…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది.
మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. చౌటుప్పల్లోని ఖైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున స్పార్కియో వాహనం లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతులను ఏపీకి చెందిన డీఎస్పీ శాంతారావు, మేక చక్రధర్గా గుర్తించారు.
వీరు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ఇక, వాహనం ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
అయితే, పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.