
ప్రభుత్వ వసతి గృహంలో విద్యుత్ షాక్… ఒకరికి తీవ్ర గాయాలు
గిరిజన ప్రభుత్వ వసతి గృహంలో నివాసం ఉంటున్న విద్యార్థిని విద్యుదాఘాతానికి గురైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విద్యుత్ తీగలపై పడిన చున్నీని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
వివరాల్లోకి వెళితే జడ్చర్లకు చెందిన రాజేశ్వరీ గుండ్లపోచంపల్లి డివిజన్, కండ్లకోయలోని CMR ఐటీ క్యాంపస్ లో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నారు.
ఆమె మేడ్చల్ పరిధిలోని గిరిజన ప్రభుత్వ వసతి గృహంలో నివాసం కలిగి ఉన్నారు. వసతిగృహంలో దాదాపు 110 మంది విద్యార్థులు నివాసం ఉంటున్నారు.
వసతిగృహం ప్రాంగణంలో, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు గాలి పక్కన, ముందు భాగంలో ఉంచారు. మంగళవారం, రాజేశ్వరి వసతిగృహ ప్రాంగణంలో బట్టలు అరుస్తూ ఉండగా, గాలి బలంగా వేశారు.
ఆ సమయంలో ఆమె చున్నీ ఎగిరి కరెంట్ తీగల పై పడింది. అందులో ఉన్న రాడ్ ఉపయోగించి చున్నీని తీసుకునే ప్రయత్నంలో ఆమెకు విద్యుదాఘాతం సంభవించింది.
ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అలాగే మరొక ముగ్గురు విద్యార్థినులు లావణ్య, నందిని, రుచితకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి.
తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వరిని సహచర విద్యార్థులు స్థానికుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



