Andhra PradeshPolitical

టీడీపీ దాడులు చేస్తోంది.. రక్షించండి: YS జగన్

టీడీపీ దాడులు చేస్తోంది.. రక్షించండి: YS జగన్

ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. ‘సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.

అధికార పార్టీ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది అని ధ్వజమెత్తారు. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఆరోపించారు.

తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. మరోవైపు టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతీ కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుర్తు చేశారు.

గవర్నర్ జోక్యం చేసుకోవాలి
‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది.

వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్‌ @governorapవెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.

సీఎం పదవికి జగన్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగగా.. అందులో అధికార వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అయితే సీఎం పదవికి రాజీనామా చేసే విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూట్‌నే జగన్ ఫాలో అయ్యారు. గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు స్వయంగా రాజీనామా సమర్పించనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే చివరకు కేసీఆర్‌ తన సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు.అయితే ఇప్పుడు జగన్ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించనున్నారని ఈరోజు సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లకుండా.. తన రాజీనామా లేఖను సిబ్బంది ద్వారా గవర్నర్‌కు పంపించారు.

ప్రేమ ఏమైందో తెలియదు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఘోర ఓటమి నేపథ్యంలో జగన్ చాలా నిరాశతో, కళ్లలో నీళ్లు తిరిగుతున్నట్టుగా కనిపించారు.

ఈ సందర్బంగా జగన్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్ మాట్లాడుతూ.. ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.. ఇలా జరుగుతుందని, ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని చెప్పారు. అమ్మ ఒడితో 53 లక్షల తల్లులకు మంచి చేశామని.. మరి అక్కాచెల్లమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదని అన్నారు.

66 లక్షల మంది అవ్వతాతలకు, వికలాంగులకు, వింతతువులకు పెన్షన్ ఇచ్చామని.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశామని.. గతానికి భిన్నంగా ఎంతో మంచి చేస్తూ ముందుకు సాగిన కూడా అవ్వతాతలు చూపిన అప్యాయత కూడా ఏమైందో తెలియడం లేదని చెప్పుకొచ్చారు.1.05 లక్షల మంది పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మలకు మంచి చేస్తూ.. ఇచ్చిన మాట తప్పకుండా వారికి అండగా నిలిచామని.. మరి వారి ప్రేమాభిమానులు ఏమయ్యాయో తెలియదని జగన్ అన్నారు.

చేయూత అందుకుంటున్న 26 లక్షల అక్కాచెల్లమ్మల అప్యాయత ఏమైందో తెలియదని అన్నారు. పిల్లల చదవులకు అండగా నిలిచామని, చదవుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదని అన్నారు.

దాదాపుగా 54 లక్షల రైతన్నలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడి సాయం అందించామని.. సమయానికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామని.. పగటిపూట 9 గంటల కరెంట్ ఇచ్చామని.. మరి వారి ప్రేమ ఏమైందో తెలియదని జగన్ అన్నారు.

ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి’ అని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button