MuluguPoliticalTelangana

సెల్ ఫోన్ పోతే వర్రీ కావొద్దు : ఏటూరు నాగారం ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ

సెల్ ఫోన్ పోతే వర్రీ కావొద్దు : ఏటూరు నాగారం ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ

సెల్ ఫోన్ పోతే వర్రీ కావొద్దు : ఏటూరు నాగారం ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ

-CEIR అప్లికేషన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి.

రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు.

చోరికి గురైన 11 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

మానవుని జీవితంలో ఒక భాగమైన సెల్ ఫోన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందేనని అలాంటి సెల్ఫోన్ చోరీకి గురైతే ఎటువంటి వర్రీ కి గురి కావద్దని ఏటూరు నాగారం ఏ ఎస్పి శివం ఉపాధ్యాయ స్పష్టం చేశారు.

జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ములుగు జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని, ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు.

అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.

ఫోన్లు రికవరీ

ములుగు జిల్లాలోని ఆయా మండలాల్లోని ఫోన్లు రికవరీ మిస్సింగ్ చోరీకి గురైన బాధితులు .1. జెట్టి రాజు పసర.
2 పి శరత్ మహబూబాద్ 3 కిషన్ తొర్రూర్ 4 పోచిమల్లు చల్పక.5 చింత కళ్యాణ్ మంగపేట 6. వసంత్ కుమార్ ఏటూరు నాగారం 7.రాజ్ కుమార్ .రాంనగర్ 8. రంజిత్ కుమార్ ఏటూరు నాగారం 9 గండపల్లి సుఖేష్ ఏటూరు నాగారం 10 కల్తీ సుగుణ . పస్రా. 11శ్రీరాములు ఏటూరు నాగారం

బాధితుల మిస్సింగ్. చోరీలకు గురి అయిన ఫోన్లను SEIR పోర్టల్ ద్వారా బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఫోన్ లను ట్రేస్ చేసి రికవరీ చేసి గుర్తించి. ప్రతిభ కనబరిచిన ఏటుర్ నాగారం కానిస్టేబుల్ హరీష్ .శ్రీనివాసులను ఏ ఎస్పీ శివమ్ ఉపాధ్యాయ. ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్. ఎస్సై ఎస్ కే తాజుద్దీన్. బాధితులు తదితరులు పాల్గొన్నారు

    Related Articles

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Back to top button

    Adblock Detected

    Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!