HyderabadPoliticalTelangana

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం..

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం..

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం..

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఆదివారం రోజున ఆందోళనకు దిగారు.ఇంటిపైకి రాళ్లు కూడా రువ్వారు.

ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు గోడ దూకి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోకి వెళ్లారు. ఇంటి ఆవరణలో అక్కడి పూలకుండీలను పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగినవారు..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన రేవతి కుటుంబానికి రూ. కోటి సాయం అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ మృతికి అల్లు అర్జున్ కారణమని ఆరోపించారు.

అయితే ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భద్రతా బలగాలను మోహరించారు.

అయితే అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన వారు ఓయూ జేఏసీ నేతలుగా పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశారు. ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు ఈ ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక, ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడి చేరుకున్నారు.

మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర చర్చ సాగుతుంది. కొందరులు అల్లు అర్జున్‌కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌కు మెసేజ్ పోస్టు చేశారు. తన ఫ్యాన్స్ భాద్యతాయుతంగా అభిప్రాయాలను వ్యక్తపరచాలని, ఎవరినీ దూషించవద్దని కోరారు.

ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ పోస్టులు వేస్తున్నవారిపై చర్యలు తీసుకోబడతాయని అన్నారు. నెగిటివ్ పోస్టులు వేస్తున్నవారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు సూచించారు.

”నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దని విన్నపం.

ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేస్ ఐడీలు, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్నవారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు వేస్తున్నవారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్‌కు సూచిస్తున్నాను” అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button