రాజకీయ పార్టీలు సహకరించాలి :స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన.
రాజకీయ పార్టీలు సహకరించాలి
రాజకీయ పార్టీలు సహకరించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 10,
భద్రాచలం మరియు సారపాక గ్రామ పంచాయతీల లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఆమోదం మరియు అభ్యంతరాల స్వీకరణ పై జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అధ్యక్షతన సోమవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 30వ తేదీన విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం భద్రాచలం మరియు సారపాక గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు , ఆమోదం మరియు అభ్యంతరాల స్వీకరణ ఫిబ్రవరి 9 నుండి 13వ తేదీ వరకు పూర్తి చేయుటలో రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీలో 41 వేల ఎనిమిది మంది ఓటర్లు కు గాను 60 పోలింగ్ కేంద్రాలు మరియు సారపాక గ్రామపంచాయతీ పరిధిలో 19045 మంది ఓటర్ల కు గాను 36 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు . 11 వ తేదీ న మండల స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, ఏదైనా పోలింగ్ కేంద్రాల గుర్తింపు లో అభ్యంతరాలు లేదా ఓటర్లకు దూరంగా ఉన్నట్లయితే లికిత పూర్వకంగా స్థానిక ఎంపీడీవోల కు 12 వ తేదీన అభ్యంతరాల పరిశీలన ఫిబ్రవరి 14వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని ఆమె అన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, నేషనల్ కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, సిపిఐ మరియు సిపిఎం రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.