హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో అడ్మిషన్స్ పొందే ఎస్టీ విద్యార్ధులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో అడ్మిషన్స్ పొందే ఎస్టీ విద్యార్ధులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో అడ్మిషన్స్ పొందే ఎస్టీ విద్యార్ధులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ బేగంపేట హైదరాబాద్ పబ్లిక్స్కూల్తో పాటు రామంతపూర్లో అడ్మిషన్స్ పొందే గిరిజన విద్యార్థులకు రెండు హాస్టళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెంబర్53 ప్రకారం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రెండు చోట్ల ఒక్కోటి చొప్పున బాల బాలికలకు వేరు వేరుగా ఈ హాస్టళ్లు నిర్మిస్తున్నారు. అది కూడా వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇవి పనిచేస్తాయి. హెచ్పీఎస్లోని హాస్టల్కు రూ. 20 లక్షల 30 వేలు, అలాగే రామంతపూర్లోని హాస్టల్కు రూ.
కోటి 33 లక్షలను గిరిజన సంక్షేమ శాఖ ఖర్చు చేయనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు "ఉగాది పండుగ" కానుక గా కొత్త హాస్టళ్లను మంజూరు చేయడం విశేషం. "విద్యపై పెట్టుబడి, భవిష్యత్తు పెట్టుబడిగా తమ ప్రభుత్వం భావిస్తుందని సీఎం రేవంత్రెడ్డి తరచూ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హెపీఎస్లో అడ్మిషన్స్ పొందే గిరిజన బిడ్డల చదువుల కోసం ప్రత్యేకంగా రెండు హాస్టళ్లు మంజూరు కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
