రెడ్ హాండెడ్ గా ఏసీబీకి చిక్కిన హెడ్మాస్టర్...

రెడ్ హాండెడ్ గా ఏసీబీకి చిక్కిన హెడ్మాస్టర్...

కొత్తగూడెం పట్టణంలోని కూలీ లైన్ హైస్కూల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు ఏసీబీ DSP వై.రమేష్ తెలిపారు.

కరాటే శిక్షణ పాఠశాలకు రూ.30 వేలు మంజూరు అయ్యాయి. ఇన్ స్ట్రక్చర్ కు కావలసిన రూ.30వేలలో రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీ ను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడిని నిర్వహించినట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story