8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం

8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం

సభ్యసమాజం తల దించుకునే ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పాఠశాల విద్యార్థినిపై ఉపాధ్యాయులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కృష్ణగిరి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. విద్యార్థిని నెల రోజులుగా బడికి వెళ్లలేదు. ప్రధానోపాధ్యాయుడు, సహచర విద్యార్థినులు ఆరాతీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లిని అడిగారు. తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్‌ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళుతున్నట్లు ఆమె చెప్పడంతో నివ్వెరపోయారు. పాఠశాలలో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు జిల్లా బాలల భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బాలికను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు చేయించారు. అనంతరం బర్గూర్‌ ఆల్‌ ఉమన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాలికను ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై జిల్లా శిశు సంరక్షణ అధికారి బార్గూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలలో పనిచేస్తున్న బార్గూర్‌కు చెందిన చిన్నసామి (57), మత్తూరుకు చెందిన ఆరుముగం (45), వేలంపాటికి చెందిన ప్రకాష్ (37) అనే ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. దీని కారణంగా బాలిక గర్భవతి అయినట్లు తేలింది. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు పాఠశాలను ముట్టడించి ధర్నాకు దిగారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సీరియస్‌గా స్పందించారు. ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated On 6 Feb 2025 2:40 PM IST
Admin

Admin

Next Story