హోళీ వేళ విషాదం... రంగులు చల్లద్దొన్నందుకు కొట్టి చంపారు

హోళీ వేళ విషాదం... రంగులు చల్లద్దొన్నందుకు కొట్టి చంపారు

రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్‌లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక యువకుడికి హోలీ రంగులు పూయడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో ఆ యువకుడు అడ్డుపడినందుకు ఆ ముగ్గురు దాడి చేసి చంపారు.

ఈ సంఘటన రాజతన్‌లోని రాల్వాస్ గ్రామంలో జరిగింది, 25 ఏళ్ల ఆ యువకుడు స్థానిక లైబ్రరీలో చదువుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

స్థానిక లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, అశోక్, బబ్లు, కలురామ్ అనే ముగ్గురు వ్యక్తులు లైబ్రరీ వద్దకు వచ్చి అతనిపై హోలీ రంగులు వేయడానికి ప్రయత్నించారు.

బాధితుడిని హన్స్‌రాజ్‌గా గుర్తించారు. అయితే, హన్స్‌రాజ్ వారిని ప్రతిఘటించడంతో, వారు అతనిని దారుణంగా కొట్టడం ప్రారంభించారు.

ముగ్గురు నిందితులు ఆ యువకుడిని తన్ని, బెల్టులతో దాడి చేసి, వారిలో ఒకరు బాధితుడిని గొంతు నులిమి చంపారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ దినేష్ అగర్వాల్ తెలిపారు.

న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హన్స్‌రాజ్ కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు.

బాధితుడి కుటుంబం రూ. 50 లక్షల పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, హన్స్‌రాజ్‌ను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Ck News Tv

Ck News Tv

Next Story