EducationTelangana

అధ్యాపకులు లేక ఇంటర్ విద్యార్థులు పెయిల్

అధ్యాపకుడు లేక ఇంటర్ విద్యార్థులు పెయిల్

కాలేజీ కట్టారు అధ్యపకున్ని మరిచారు

సివిక్స్ అధ్యాపకుడు లేక ఇంటర్ విద్యార్థులు పెయిల్
సి కె న్యూస్ ప్రతినిధి
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కొరకు ఎన్నో ఏళ్ల మండల ప్రజల నిరీక్షణ

మండల ప్రజల కోరిక మేరకు 2021లో
సభవతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఏర్పాటైన జూనియర్ కళాశాల

కళాశాల ఏర్పాటైన సివిక్స్ అధ్యాపకుడు లేక విద్యార్థులు ఫెయిల్

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కొరకు మండల ప్రజలు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడగా తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో 2021సంవత్సరం బీర్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటయింది.

కళాశాల ఏర్పటైన సివిక్స్ అధ్యాపకుడు లేక ఈ సంవత్సరం 2023లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సివిక్స్ సబ్జెక్టులో 33 మంది గాను 20 మంది విద్యార్థులు పాస్ కాగా మిగతా 13 మంది ఫెయిలయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులంతా నిరుపేద కుటుంబానికి చెందినవారే. స్థానిక ప్రజా ప్రతినిధులు తరచూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తనిఖీలు చేయాలన్న తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదేశాలు పాటించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారనడంలో ఆచార్యాం లేదు.

అధ్యాపకుడు లేకనే తాము సివిక్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యామని, కనీసం పరీక్షల వరకైనా అధ్యాపకుడు వస్తారని ప్రభుత్వం ఇచ్చిన సివిక్స్ పుస్తకం తెరవ లేదని, ఈ విషయంలో చదువుల తల్లి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సివిక్స్ సబ్జెక్ట్ లొ ఫెయిల్ అయిన 13 మంది విద్యార్థులకు తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ జూనియర్ కళాశాల లో కనీసం జూనియర్ అసిస్టెంట్ కూడా లేరని విద్యార్థులు వాపోతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected