Telangana

ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు

ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు

ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు


హైదరాబాద్ :ప్రతినిధి

హైదరాబాద్ :జూన్ 01
ఆర్టీసీ ఉద్యోగుల‌కు డీఏ ఇస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్, చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ గురువారం ప్ర‌క‌టించారు. జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది.

మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు..

▪️రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో డీఏ.

▪️జూన్ నెల వేతనంతో కలిపి చెల్లింపు.

▪️ సిఎం కేసీఅర్ గారి సూచనల మేరకు డిఏ ను ఆమోదించిన మంత్రి పువ్వాడ.

▪️టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడి.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడించారు.

జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు.

ఉద్యోగులకు డిఏ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారి దృష్టికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇటీవలే తీసుకెళ్లగా ముఖ్యమంత్రి కేసీఅర్ గారి సానుకూలంగా స్పందించారు. వారి సూచనల మేరకు ఆయా నిర్ణయాన్ని నేడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆమోదించారు.

ఉద్యోగులకు అందాల్సిన‘‘తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని, 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది.’’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected