EducationTelangana

ఎవరు దీనికి భాద్యులు ఉపాధ్యాయుల విద్యాశాఖ మంత్రి నా?

ఎవరు దీనికి భాద్యులు ఉపాధ్యాయులా ? విద్యాశాఖ మంత్రి నా?

హైదరాబాద్: మే 11
తెలంగాణ రాష్ర్టానికి చెందిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి విడుదల చేశారు. ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఉత్తీర్ణత 86 .60 శాతం గా వచ్చింది. అంతేకాకుండా 2793 స్కూల్స్ లో పరీక్ష రాసిన మొత్తం విద్యార్థులు పాస్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.

వీటిలో 1410 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, మిగిలినవి ప్రభుత్వ పాఠశాలలు. కాగా ఇక్కడ ఒక షాకింగ్ విషయం రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా
25 స్కూల్స్ లో కనీసం ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వకపోవడంపై పిల్లల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కోల్పోతున్నాయి,

ఉపాధ్యాయులు ఎప్పుడు జీతాలు, పి ఆర్ సి లు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు సెల్ ఫోన్లతో కాలక్షేపం మీద పెట్టిన శ్రద్ధ పిల్లల చదువుపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా? ఇప్పుడు ఈ సంఘటన సంచలనంగా మారింది. అయితే ఈ 25 స్కూల్స్ ఏ జిల్లాలో ఉన్నవి అన్నది తెలియాల్సి ఉంది.

ఈ పాఠశాలలలో ఒక్క విద్యార్హ్ది కూడా పాస్ అవ్వకపోవడం అంటే అక్కడ ఆన్న టీచర్స్ ఏమి చేస్తున్నారు ? ఆ జిల్లా విద్యాశాఖాధికారి ఏమిచేస్తున్నారు ? పర్యవేక్షణ లోపమా ఇలాంటి ఎన్నో సందేహాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచింపచేస్తున్నాయి, ఒక్కొక్క ఉపాధ్యాయులకు వేలు లక్షల్లో జీతాలు తీసుకున్న జీతాలకు సరైన న్యాయం చేస్తున్నారా? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.

మీలో టీచర్ వృత్తికి ఎంతమంది న్యాయం చేయగలుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటనకు ఎవరిని బాధ్యులను చేద్దాం విద్యాశాఖ మంత్రి ని రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దామా? లేక 25 స్కూల్లో టీచర్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేద్దామా? దీనికి ఎవరు బాధ్యులను చేద్దాం
పాఠశాలలో ప్రాథమిక విధి విద్యను ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా తన విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యేలా చూసుకోకపోతే ఆ పాఠశాలను నిర్వహించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు నాణ్యమైన విద్యను అందించే టీచర్లను నియమించండి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected