
వైఎస్ షర్మిల
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
TSPSC పేపర్ లీకుల్లో SIT దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుంది.
ఇప్పటిదాకా 19మందిని అరెస్ట్ చేశామని చెప్తున్న SIT..
పాత్రధారులను మాత్రమే దోషులుగా చూపెడుతూ సూత్రధారులకు క్లీన్ చీట్ ఇచ్చే పనిలో పడింది.
ప్రగతి భవన్ డైరెక్షన్ లోనే సాగుతున్న దర్యాప్తులో తెరవెనుక ఉన్న అసలు దొంగలను దాచిపెడుతున్నారు.
పేపర్ లీకులు దేశాలు దాటిపోయినా పట్టింపు లేదు.
బోర్డ్ సభ్యుల్లో ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదు.
కనీసం కాన్ఫిడెన్షియల్ అధికారిని కూడా బాధ్యతల నుంచి తప్పించలేదు.
దర్యాప్తు ముగిసే వరకు బోర్డ్ సభ్యులపై కనీసం నిఘా పెట్టలేదు.
పేపర్ లీకుల్లో కేవలం ఉద్యోగులు మాత్రమే ఉంటే CBI దర్యాప్తుకు కేసీఆర్ అండ్ బ్యాచ్ కి భయమెందుకు?
CBI పేరు చెప్తేనే వణుకు పుడుతుందంటే అసలు దొంగలు ప్రగతి భవన్ లోనే ఉన్నట్లా?
కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీకులపై CBI విచారణకు ఆదేశించాలి.
TSPSC ప్రస్తుత బోర్డ్ తక్షణం రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చేయాలని YSRTP ఆదనేత్రి వై యస్ షర్మిళ డిమాండ్ చేశారు