
కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా?
అదే ప్రాంతంలో సర్కారు భూమిని హెచ్ఎండీఏ గజానికి లక్ష పదివేలకు అమ్ముతుంది?
గజానికి 7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు?
దీనికోసమే కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకుని ప్రజలకు తెలియకుండా దాచాలనుకుంటారా?
పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్… మీ పార్టీకి మాత్రం భూములెలా వచ్చాయి?
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంతోపాటు జిల్లా కార్యాయాలయాల పేరుతో కారు చౌకగా స్థలాలు కొట్టేసింది చాలదా?
గతంలో కాంగ్రెస్ పార్టీ బోయినిపల్లిలో ఇదే తరహాలో 10 ఎకరాలకుపైగా స్థలాన్ని కొట్టేసింది
బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసే దోచుకుంటున్నాయి… కలిసే అధికారాన్ని పంచుకుంటున్నాయి
వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయబోతున్నాయి
బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు లీడర్లు పార్టీని వీడుతున్నారంటూ ఆ రెండు పార్టీలు, ఒక సెక్షన్ మీడియా దుష్ప్రచారం
బీజేపీ భగభగమండే సూరీడు లాంటి పార్టీ….
మబ్బులను చూసి సూరీడు కాంతి తగ్గిందనుకోవడం భ్రమ
ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం దాగి ఉంది
పేదల వద్ద కారుచౌకగా ఎకరాల చొప్పున కొట్టేసిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు
ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసిన తరువాత గజాల లెక్క రియల్ ఎస్టేట్ పేరుతో లక్షల కోట్ల దందా చేస్తున్న కేసీఆర్ కుటుంబం
బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు…
కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి
ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలి
లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం
రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరిక
‘‘కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా? ఆ ప్రాంతంలో గజం లక్షకుపైగా పలుకుతుంటే రూ.7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అదే ప్రాంతంలో సర్కారు భూమిని హెచ్ఎండీఏ అధికారులు గజానికి లక్ష పదివేలకు చొప్పున మార్కెట్ లో అమ్మకానికి పెడుతూ ఈరోజు పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదిగో ఆధారం(పత్రికల్లో ఇచ్చిన నోటిఫికేషన్ యాడ్ ను చూపిస్తూ…).. మరి అదే ప్రాంతంలో రూ.550 కోట్ల విలువైన భూమిని 40 కోట్లలోపే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవానికి ఓపెన్ మార్కెట్ లో కోకాపేటలో ఎకరం ధర వంద కోట్ల రూపాయలకుపైగా పలుకుతోందని, ఈ లెక్కన బీఆర్ఎస్ కు కట్టబెట్టిన భూముల విలువ 1100 కోట్ల రూపాయలకు పైమాటేనని అన్నారు. ఈ భూమిని ధారాదత్తం చేసుకునేందుకు ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకున్నారని, అయినప్పటికీ మీడియాకు మాత్రం ఈ వివరాలను వెల్లడించకుండా రహస్యంగా దాచి ప్రజల ఆస్తులను కొట్టేశారని మండిపడ్డారు. పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్… సొంత పార్టీకి కేటాయించుకునేందుకు భూములెక్కడినుండి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం అత్యంత కారు చౌకగా భూమిని కొట్టేసిన కేసీఆర్… ఆ భూములు చాలవని ‘‘ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలెప్ మెంట్’’ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని కాజేయడం దుర్మార్గమన్నారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ జీవో పరిధిలోని పేదల వంద కారు చౌకగా ఎకరాల చొప్పున భూములను కొనుగోలు చేసిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు… ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేసుకుని గజాల చొప్పున అమ్ముకుంటూ లక్షల కోట్ల రియల్ దందాకు తెరదీశారని ధ్వజమెత్తారు. ఈ విషయాలను ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పెద్ద ఎత్తున ఉద్యమించి సర్కార్ భూ భాగోతాన్ని ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. బీజేపీ సోయం బాపూరావు కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు ఈరోజు ఆదిలాబాద్ వచ్చిన బండి సంజయ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
• ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు పేదలు గుర్తుకొస్తారు.. ఎన్నికలైపోంగనే పేదల భూములను గుంజుకుంటున్నారు. పేదల స్థలాల్లోనే కలెక్టరేట్లు, ఫైర్ స్టేషన్లు, కాలేజీలు కడతామంటున్నరు. ధరణి పేరుతో ఎట్లా రైతులను మోసం చేస్తున్నారో.. బీఆర్ఎస్ నాయకులు ఎట్లా లాభపడ్డారో జగమెరిగిన సత్యమే.
• దీంతోపాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల పేరుతో గజానికి వంద రూపాయల చొప్పున ఒక్కో జిల్లాలో ఎకరానికి పైగా స్థలాలు తీసుకుంటూ 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అట్లాగే భూములమ్మి పైసలు దోచుకుంటున్నరు.
• ఇంకా దుర్మార్గమైన విషయం ఏమిటంటే… మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు అసలు విషయాన్ని మాత్రం దాచి వేశారు.
• అదేమిటంటే.. హైదరాబాద్ లోని కోకాపేటలోని 11 ఎకరాల విలువైన భూమిని ఇన్ స్టిట్యూట్ పేరుతో బీఆర్ఎస్ కు పార్టీకి ధారాదత్తం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనివిలువ రూ.40 కోట్లు మాత్రమే చెల్లించి ఆ భూమిని కొనేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీని కోసమే కేబినెట్ మీటింగ్ పెట్టారు. కానీ ఈ విషయం మాత్రమ చెప్పలేదు. ఈ ఉత్తర్వులను రహస్యంగా ఉంచారు.
• ఇదే కోకాపేట ప్రాంతంలో ప్రభుత్వ భూమిని అమ్మడానికి హెచ్ఎండీఏ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది పత్రికల్లో వచ్చింది. కోకాపేటలో ఒక గజం విలువ ఒక లక్షా 10 వేల చొప్పున ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏ అమ్మకానికి పెట్టింది.
• కానీ అదే ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థలానికి సంబంధించి ఒక్క గజానికి 7,500 రూపాయల చొప్పున మాత్రమే చెల్లించి కొనేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ స్థలం మార్కెట్ విలువ రూ.550 కోట్ల పైమాటే…
• ఓపెన్ మార్కెట్ లో అక్కడ ఒక్క ఎకరానికి రూ.వంద కోట్ల విలువ చేస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే 11 వందల కోట్లు.. మరి అంత తక్కువకు బీఆర్ఎస్ ఎట్లా కొంటది? ఎవడయ్య జాగీరనుకుంది?
• ప్రభుత్వ అమ్మే రేటుకు, పార్టీకి ఇచ్చే రేటు విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఓపెన్ మార్కెట్ లో 11 వందల కోట్లు ఉంటే… 40 కోట్లే చెల్లించి కొంటారా?
• గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2008లో హైదరాబాద్ లోని బోయినిపల్లిలో 10 ఎకరాల పైగా స్థలాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టింది. ఈరోజు బీఆర్ఎస్ ఆ పనిచేసింది. ఇంతకంటే దారుణం, మోసం ఇంకోటి లేదు.
• డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడానిక స్థలం లేదంటారు… జీతాలివ్వడానికి పైసల్లేవంటారు.. దోపిడీలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయ్. ఇది భరించలేకే ఏలేటి, రామారావు కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వచ్చారు.
• కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. ఇద్దరూ కలిసి ఏ విధంగా ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారో దీనినిబట్టే అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా గండి కొడుతోంది. వాస్తవానికి ఆ రెండు పార్టీలు ఒక్కటే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే పనిచేస్తున్నారు. కలిసే దోచుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనం.
• ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పేదలకు ఇండ్లు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? బీఆర్ఎస్ నేతలు దొడ్డిదారిన దోచుకోవడానికి భూములు ఎట్లా వస్తున్నాయో సంగతి తేలుస్తాం.వెంటనే ప్రభుత్వం వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు ఇవ్వాలి. వెంటనే సీఎం కేసీఆర్ ఈ భూ దందాను బంద్ చేయాలి. ఈ విషయాన్ని అడ్డుకుంటాం…
• కర్నాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధమేంది? దేశంలో 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో గెలిచింది.. మరి ఇక్కడ రాలేదు కదా?… అట్లాగే కర్నాటకలో ఓడిపోతే.. తెలంగాణకు సంబంధం ఏంది? రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని తేలిపోయింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అందుకే బీజేపీని అడ్డుకోవడానికే గుంట నక్కల పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. బీజేపీ సింహం.. సింగిల్ గానే పోటీ చేసి పూర్తి మెజారిటీతోనే అధికారంలోకి రాబోతోంది. సీఎంసహా అన్ని సర్వే సంస్థల నివేదికలు ఇవే చెబుతున్నాయి.
• ఇది తెలిసి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కొత్త నాటకాలు షూరూ చేసినయ్. కర్నాటకలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి తెలంగాణలోని బీజేపీ నేతలంతా కాంగ్రెస్ లోకి పోతారని ప్రచారం చేస్తున్నయ్. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని తెలిసీ ఆ పార్టీని లేపేందుకు డ్రామాలాడుతున్నయ్. కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్లలో 12 మంది బీఆర్ఎస్ లోకి పోయారు. ఉన్న ఐదుగురిలో నలుగురు నాలుగు స్థంభాలాట ఆడుతున్నరు. ఒకాయన మాత్రం చౌరస్తాలో నిలబడి ఏం చేయాలో తెల్వక చూస్తున్నడు… రేపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసే ఎన్నికల్లో పనిచేయబోతున్నాయి. కలిసే అధికారాన్ని పంచుకోబోతున్నయ్.
• అయినా కర్నాటకకు, తెలంగాణకు ఏం సంబంధం? కర్నాటకలో అధికారం పోయినా ఓట్ల శాతం మాత్రం తగ్గనేలేదు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా 36 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ కంటే కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కడ పెరిగిందో సమాధానం చెప్పాలి. దుబ్బాక నుండి మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వరకు ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు.
• బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయమని తేల్చాయి. అయినా ఈ ప్రచారం జరుగుతుంటే ఇదంతా కేసీఆర్, కాంగ్రెస్, ఒక సెక్షన్ మీడియా కలిసి ఆడుతున్న నాటకమిది. జర్నలిస్టులకు, రాజకీయ విశ్లేషకులకు కూడా ఈ విషయం తెలిసి మౌనంగా ఉంటూ కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తడం బాధాకరం. దీనివల్ల మీడియా విలువను జర్నలిస్టులు తగ్గించుకోవడం బాధాకరం…మీడియా ఆలోచించుకోవాలని నా విజ్ఝప్తి….
• బీజేపీ అంటే భగభగ మండే సూరీడు… అప్పుడప్పుడు మబ్బులొస్తుంటయ్… అవి రాగానే సూరీడు పనైపోయింది, కాంతి తగ్గిందనుకోవడం భ్రమ. అవి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి.
• ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత లక్షల కోట్ల విలువైన మహా స్కాం. ఎంత దుర్మార్గమంటే… ఆ ప్రాంతంలోని పేదల దగ్గర అత్యంత తక్కువ ధరకు ఎకరాల చొప్పున కొని ఇప్పుడు ఈ జీవోను ఎత్తివేసి గజాల చొప్పున అమ్ముకుంటూ భూ దందా చేస్తున్నయ్. ఈ భూముల్లో 90 శాతం కేసీఆర్ కుటుంబానివి, బీఆర్ఎస్ కుటుంబానివే….