
పొంగులేటి, జూపల్లితో మళ్లీ ఈటల రాజేందర్ సుదీర్ఘ భేటీ
హైదరాబాద్: భారాస బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మరోసారి భేటీ అయ్యారు..
నగర శివారులోని ఓ ఫామ్హౌస్లో దాదాపు నాలుగు గంటలుగా చర్చలు జరుపుతున్నారు. గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ బలోపేతంతో పాటు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఈ సమయంలోనే వీరితో భేటీ నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.