KhammamPoliticsTelangana

పొంగులేటి, జూపల్లి పై సస్పెన్షన్ వేటు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి కృష్ణారావు బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం ఈ చర్యలు చేపట్టింది..

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను భారత్ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది.

గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ నాయకత్వంపై అసంతృప్తితో వ్యాఖ్యలు చేస్తున్నారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ అగ్ర నాయకత్వం తనను పట్టించుకోలేదని, మూడేళ్లుగా పార్టీ సభ్యత్వాన్ని కూడా రెన్యూవల్ చేయలేదని ఆరోపించారు. కొత్తగూడెంలో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్పైనా, ఆయన కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు.

ఇది జరిగిన గంటల వ్యవధిలో పార్టీ కార్యాలయం నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడడం గమనార్హం.

ఈ సస్పెన్షన్ పైన ఇద్దరూ విడివిడిగా వారివారి జిల్లాల్లో మీడియాతో వివరంగా మాట్లాడడానికి కసరత్తు మొదలుపెట్టారు. మరికొన్ని గంటల్లో పార్టీ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై మీడియాతో మాట్లాడనున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected