
సత్తుపల్లి: కాంగ్రెస్ ర్యాలీలో అపశృతి
తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కాగా ఈ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీలో వెళుతున్న బైకును లారీ ఢీకొట్టింది. దీంతో రామనగరం గ్రామానికి చెందిన జయ్ రాజ్(60)కి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పార్టీ నాయకులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.