PoliticsTelangana

లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Si చెయ్యి చేసుకున్న షర్మిళ

YSRTP చీఫ్ వైఎస్ షర్మిల (Ys sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
దీనితో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల (Ys sharmila) ప్రశ్నించారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో వారిని తోసేసి మరీ షర్మిల (Ys sharmila) బయటకు వచ్చారు.

ఆ తరువాత అక్కడే రోడ్డుపై బైఠాయించారు. షర్మిల (Ys sharmila) అరెస్ట్ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆమెను అడ్డుకుంటుండగా..వారిని నెట్టేసి ప్రశ్నిస్తూ ముందుకు కదులుతూ వచ్చారు. అయితే అడ్డొచ్చిన మహిళా కానిస్టేబుల్ చెంపపై షర్మిల కొట్టినట్టు వీడియోల్లో కనిపిస్తుంది. అలాగే ఓ ఎస్సైపై కూడా షర్మిల చేయి చేసుకోగా..”నన్నెందుకు కొడుతున్నావ్” అంటూ ఆ ఎస్సై షర్మిలను ప్రశ్నించారు. కాగా నిరుద్యోగ ధర్నాకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోల్లో ఈ విషయం అర్ధమవుతుంది. చివరకు షర్మిలను మహిళా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


అయితే వైఎస్ షర్మిల తీరుతో పోలీసులు చుక్కలు చూశారు. అడ్డుకుంటున్న మహిళా కానిస్టేబుళ్లను నెట్టేయడం చేయగా..పురుషులను ప్రశ్నిస్తూ వచ్చారు. అలా నడుచుకుంటూ వస్తున్న ఆమె తన కాన్వాయ్ ఎక్కే ప్రయత్నం చేశారు. దీనితో అక్కడి పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. దీనితో ఆమె దిగగా పోలీస్ వాహనంలోకి ఎక్కించేందుకు చూశారు. కానీ అక్కడే ఉన్న ఓ ఎస్సైపై కూడా షర్మిల చేయి చేసుకున్నారు. దీనితో ఆ ఎస్సై తిరిగి ప్రశ్నించగా ఆమె కూడా అంతే ఆగ్రహానికి గురయ్యారు.


కాగా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై షర్మిల ఇతర పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పై పోరాడడానికి కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిరుద్యోగ దీక్షకు పూనుకున్నారు. కానీ పోలీసులు ఆమె దీక్షకు అనుమతి నిరాకరించగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు షరతులతో కూడిన దీక్షకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో షర్మిల సోమవారం నిరుద్యోగ దీక్షకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వారి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. అయితే షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 353, 330 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షర్మిల అదే పీఎస్ లో ఉండగా..ఆమె తల్లి విజయమ్మ స్టేషన్ కు బయలుదేరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్టేషన్ వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు.

సహనం కోల్పోయిన షర్మిళ si పై చెయ్యి చేసుకున్నారు

దరాబాద్ లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లకుండా ఉండేందుకు ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


ఈ క్రమంలో షర్మిల ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected