
సంకినేని …బహిరంగ చర్చకు సిద్ధమా….!
ప్లేస్ నువ్వు చెప్పినా సరే…నన్ను చెప్పమన్నా సరే ….
అవాకులు చవాకులు పేలితే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుంది…
దమ్ముంటే చర్చకు రా….
సి కె న్యూస్ ప్రతినిధి
మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు కు డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ సవాల్..
సూర్యపేట పట్టణం లోని జనగామ రోడ్డులో గల వజ్ర టౌన్ షిప్ పక్కన మూసీ కాల్వను అక్రమించారని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన వట్టే జానయ్య యాదవ్
వజ్ర రైస్ మిల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానయ్య యాదవ్ మాట్లాడుతూ
మూసీ కాల్వను అక్రమించినట్లు సంకినేని చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలకు దూరం….
ఆరోపణలు చేయడం..తోక ముడవడం సంకినేనికి అలవాటు….
నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం సంకినేనికి అలవాటు….
బలహీన వర్గాలకు చెందిన నాపై ,బలహీన వర్గాల నాయకులను పంపి సంకినేని రాక్షస ఆనందం పంపుతున్నాడు…
సంకినేనికి దమ్ముంటే స్వయంగా ఆయనే చర్చకు రావాలి….అంతే కాని బలహీన వర్గాల నాయకులని పంపి రాజకీయ వికృత క్రీడకు పాల్పడుతున్నాడు ..
సర్వే నెంబర్ 480లో మూసీ కాల్వ ఆక్రమణ జరిగిందని చేస్తున్న ఆరోపణ నిరాధారం…
మూసీ కాల్వను అక్రమించలేదు అని కలెక్టర్ ఏర్పాటు చేసిన 4గురు సభ్యుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది…
బలహీన వర్గాలను వేదించడమే సంకినేని పని…
వజ్ర రైస్ మిల్ ఏర్పాటు చేసిన దగ్గర నుండి చాలా నిజాయితీగా రైతులకు సేవ చేస్తున్నాం…
రాష్ట్ర స్థాయిలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వడంలో వజ్ర రైస్ మిల్ అగ్ర స్థానం లో ఉన్నది..
నన్ను అడ్డం పెట్టుకొని మంత్రి జగదీష్ రెడ్డి మీద ఆరోపణలు చెయ్యాలి అనుకుంటే….సూర్యుడు మీద ఉమ్మివేసినట్టే…
ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి మహనాయకునిగా సంకినేని ఫీల్ అవుతున్నాడు….
20సంవత్సరాలుగా వార్డు మెంబర్ స్థాయి నుండి అంచలంచలుగా ఎదిగి నిత్యం ప్రజల్లో ఉంటున్నాను…
బలహీన వర్గాలకు చెందిన నా ఎదుగుదలను చూసి సంకినేని ఓర్వలేక పోతున్నాడు
సంకినేని సొంత ఊరికి తరిమే అంత వరకు తన పోరాటం ఆగదు అని సంకినేని వెంకటేశ్వర రావు పై
వట్టే జానయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు…