SangareddyTelangana

సంగారెడ్డి బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు..

సంగారెడ్డి బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు..

సంగారెడ్డి బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. సమావేశంలో కన్నీరు పెట్టిన ఛైర్‌పర్సన్..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో.. అన్ని పార్టీ అలెర్టయి.. ఎన్నికల రంగంలో దిగాయి. ఎవరికివారు ఎన్నికల ప్రచారాన్ని తలదన్నేలా ప్రజల్లో దూసుకెళ్తున్నారు.


కానీ.. అదే స్థాయిల్లో అన్ని పార్టీల్లోనూ వర్గపోరు ముదురుతోంది. ప్రధానంగా.. అధికార పార్టీ బీఆర్ఎస్‌లో నేతల మధ్య వర్గవిభేదాలు.. పార్టీకి శరాఘాతంగా మారుతున్నాయి. తాజాగా.. సంగారెడ్డి బీఆర్ఎస్‌లో గులాబీలు గుబులు పుట్టిస్తున్నారు. సంగారెడ్డి BRS పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కొంతకాలంగా BRS కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే.. ఓ వర్గం ఛైర్‌పర్సన్ విజయలక్ష్మి తీరుపై ఆందోళనకు దిగింది.

బినామీ ఉద్యోగుల పేర్లతో పారిశుద్ధ్య విభాగంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని.. ఈ విషయం విచారణలో రుజువైదంటూ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే.. ఛైర్‌పర్సన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. ఆరోపణలు, నినాదాలతో మున్సిపల్‌ సమావేశంలో గందరగోళం నెలకొంది. సొంత పార్టీ కౌన్సిలర్లే రాజీనామాకు పట్టుబట్టడంతో.. మనస్తాపానికి గురైన ఛైర్‌పర్సన్ విజయలక్ష్మి.. సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు.

ఆరోపణలు రుజువు చేయకుంటే.. కౌన్సిలర్లపై కేసులు పెడతానని హెచ్చరించారు విజయలక్ష్మి. గత కొన్నాళ్లుగా సంగారెడ్డి మునిసిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. అప్పటినుంచి కారు పార్టీలో వర్గపోరు చాపకింద సాగుతోంది. అది కాస్తా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో భగ్గుమంది. మొత్తంగా.. సంగారెడ్డి బీఆర్ఎస్‌లో మొదలైన ముసలం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected