
25 స్కూళ్లలో అందరూ ఫెయిల్
TS: కాసేపటి క్రితం విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మరోవైపు 2,793 స్కూళ్లలో వందశాతం విద్యార్థులు పాస్ అయ్యారని, అందులో 1,410 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 86.60% ఉత్తీర్ణత నమోదైందని మంత్రి వివరించారు.
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు 86.60 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు సాధించగా, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలికలు బాలుర కంటే 3.85 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు చేశారు.
ప్రయివేటు విద్యార్థులు 44.51 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, బాలురు 43.06 శాతం, బాలికలు 47.73 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
విద్యార్థులు ఫలితాలను https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. org తో పాటు www.ntnews. com వెబ్సైట్లలో చూసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 4.4 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.