MahaboobabadPoliticsTelangana
KGBV లో ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన మంత్రి

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని లోని కస్తూర్బా గాంధీ బాలికల విధ్యాయలయంలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై స్పందించిన రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్
విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, డీఈవోతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీసిన మంత్రి.
వెంటనే డిఇఓ, సంబంధిత అధికారులను, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ కొనసాగించాలంటూ ఆదేశించారు.
ఆస్పత్రి సూపర్డెంట్ తో మాట్లాడి విద్యార్థుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ ఆదేశించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి ప్రస్తుతం చికిత్స అందుతుందని మంత్రి తెలిపారు.