కెసిఆర్ అసమర్థ పాలన ను తీవ్రంగా ఖండించిన జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న

కెసిఆర్ అసమర్థ పాలనను తీవ్రంగా ఖండించిన జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలను మరియు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీస్ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీ తోట దేవి ప్రసన్న గారు.
ఈ సందర్భంగా తోట దేవి ప్రసన్న గారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించడం చేతగాని దద్దమ్మలు ప్రశ్నించే గొంతుకులను ఇలా పోలీసుల చేత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తూ, పంట పొలాలకు నష్టపరిహారం ప్రకటించడానికి వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత భయం ఎందుకు, కాంగ్రెస్ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం దేనికి,పోలీస్ స్టేషన్లకు తరలించడం దేనికి, లిక్కర్ స్కామ్లు, పేపర్ లీకులు వై స్పందించని ఈ ప్రభుత్వం ఇలా ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసి తప్పును కప్పి పుచ్చుకోవడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.