గొంతులో పల్లి గింజ ఇరుక్కుని బాలుడి మృతి

గొంతులో పల్లి గింజ ఇరుక్కుని బాలుడి మృతి


మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా ప్రాణాలు పోవచ్చు.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.పల్లి గింజ గొంతులో ఇరుక్కొని ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకరారం.. గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన గుండెల అక్షయ్ అనే బాలుడికి 18 నెలలు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం అక్షయ్ పల్లీలు తింటుండగా.. ఓ గింజ గొంతులో ఇరుక్కుంది.

దీంతో ఊపిరి ఆడక అక్షయ్ ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అక్షయ్ పరిస్థితి విషమించడంతో ఆదివారం (మార్చి 9) మృతి చెందాడు.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడి మృతితో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గొంతులో పల్లి గింజ ఇరుక్కుని అక్షయ్ మృతి చెందటంతో నాయకపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Ck News Tv

Ck News Tv

Next Story