![](https://cknewstv.in/wp-content/uploads/2023/12/IMG-20231216-WA0131.jpg)
—- పదవి ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం.
–నియోజవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సీకే న్యూస్ ప్రతినిధి మునీర్.
శనివారం సత్తుపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసినారు. ఈ పర్యటనలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కలుసుకొని వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండండి మీ అండగా నేను ఉంటానని హామీ ఇచ్చి అధికారంలో లేకపోయినా మీ యొక్క సమస్యపై నేను పోరాటం చేస్తానని నాకు అధికారం అనేది ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యమని అన్నారు.
ఈ పర్యటన భాగంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తల సమస్యలను గురించి చర్చించి తదనంతరం పెనుబల్లి మండలం కుప్పెన కుంట్ల గ్రామానికి చెందిన అవులురి శివరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలవగా వారిని సండ్ర వెంకటవీరయ్య పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నరు . అదే గ్రామం కు చెందిన సింహాద్రి సత్యనారాయణ ఇటీవల హార్ట్ స్ట్రోక్ తో మరణించగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించినరు.
వీరితోపాటు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, కల్లూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, నీలాద్రి ఆలయ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, కర్నాటి భద్రరెడ్డి, ఆవిటి మారేశ్వరరావు, నాగళ్ళ నరసింహారావు, బండారుపల్లి నాగేశ్వరావు, తరిమల్ల సూర్య ప్రకాష్ రావు, వేమిరెడ్డి రామకృష్ణారెడ్డి, నారుమళ్ళ లక్ష్మీ బాబు, వేల్పులు వెంకట్, కోట సుందరం, దుర్గం నాగేశ్వరావు తదితరులున్నారు.