Andhra PradeshEducationPolitical

పాఠశాలకు మిక్సీ, క్రీడా దుస్తులు వితరణ

పాఠశాలకు మిక్సీ, క్రీడా దుస్తులు వితరణ

పాఠశాలకు మిక్సీ, క్రీడా దుస్తులు వితరణ

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం,నవంబర్ 14, సీకే న్యూస్.

తను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు, వంట ఏజెన్సీ వారికి ఉపయోగపడే వస్తువులను బాలల దినోత్సవం సందర్భంగా వితరణగా అందించిన ఆ ఉపాద్యాయురాలిని ప్రధానోపాధ్యాయులు,సహచర ఉపాధ్యాయ బృందం మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ సభ్యులు ఆ ఉపాద్యాయురాలిని అభినందించారు.

వివరాలు…. మండలం నందలి జిఎల్ఎస్ ఫారం జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఒకటవ తరగతి నుంచి 10 వతరగతి విద్యార్థులు 185 మందికి వంట ఏజెన్సీ సభ్యులు మధ్యాహ్నభోజనం చేస్తున్నారు.

నేపథ్యంలో కొన్ని రోజులుగా వంట చేస్తున్నవారి అవసరాలను గుర్తించి ఆ పాఠశాల గణిత శాస్త్రం ఉపాధ్యాయిని ఆర్.రమ వంట ఏజెన్సీ వారి సౌకర్యం కోసం మిక్సీని శుక్రవారం అందించారు.అదేవిధంగా క్రీడల పట్ల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపుతుండడంతో 16 మందికి కబడ్డీ దుస్తులు పంపిణీ చేశారు.

దీంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశేఖర్, క్రీడా ఉపాద్యాయులు సురేష్, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ సభ్యులు బుజ్జమ్మ, లక్ష్మమ్మ, ఉపాద్యాయ బృందం,విద్యార్థులు కలసి గణిత శాస్త్రం ఉపాద్యాయురాలు ఆర్.రమకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button