![](https://cknewstv.in/wp-content/uploads/2024/02/n58713114017091131848540baa66abe21d23fe28e870b1b67e434c3bf27f034fe2b0c4dc03f229ab382aae.jpg)
బండి సంజయ్పై కోడి గుడ్లతో దాడి, పోలీసులపై ఆగ్రహం
బండి సంజయ్ పై కోడిగుడ్లతో దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్నారు.
వరంగల్ లో యాత్ర చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు. ఈ దాడితో అసహనం కోల్పోయిన బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు పోలీసు బందోబస్తు ఏం వద్దని.. మీరు వెళ్లిపోండి.. అంటూ పోలీసులపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.