![](https://cknewstv.in/wp-content/uploads/2024/03/Screenshot_2024-03-06-15-02-11-459_get.lokal_.localnews-edit.jpg)
రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యాన్ పట్టివేత…
ck news
కారేపల్లి మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంతో సహా వ్యాన్ ను బుధవారం పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.
గ్రామంలో వ్యాన్ లో రేషన్ బియ్యాన్ని తరలించేందుకు లోడ్ చేస్తుండగా పక్క సమాచారం మేరకు అధికారులు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని వ్యాన్ లో ఉన్న బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 30 క్వింటాలకు పైగా రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.