అభినవ భగీరథులుగా తుమ్మల…..రేవంత్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయని సీతారామ ప్రాజెక్ట్.
ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన తుమ్మల.
నాడు తెలుగుదేశం హయాంలో ప్రతిపాదనలకే పరిమితం
తుమ్మల ఓటమితో గత ఐదు ఏళ్లుగా నత్తనడకన సీతారామ ప్రాజెక్ట్ పనులు.
రేవంత్ క్యాబినెట్ లో మంత్రి గా సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల స్పెషల్ ఫోకస్
సీతారామ ప్రాజెక్ట్ లో కీలకంగా మారిన వైరా రిజర్వాయర్ తో అనుసంధానం
సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే తన జీవిత సాఫల్యం అన్న తుమ్మల
తలాపునే గోదావరి పారుతున్నా….
బీడు బారిన భూములు
సాగు నీటి కోసం దశాబ్దాలుగా రైతన్నల ఎదురుచూపులు
కళ్లెదుటే పంటలు ఎండిపోయి కరువు రక్కసి కోరల్లో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతుంటే చలించి పోయి దశాబ్ధాల సాగునీటి కలను సాకారం చేయడానికి నాడు మంత్రి గా సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసారు తుమ్మల నాగేశ్వర్ రావు.కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట్ ప్రతిపాదనలకే పరిమితం కాగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తో తుమ్మల సానిహిత్యం సీతారామ ప్రాజెక్ట్ కు పునాది పడింది.తుమ్మల ఓటమితో గత ఐదు ఏళ్లుగా నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులు.కాంగ్రెస్ అధికారం లోకి రావడం రేవంత్ క్యాబినెట్ లో తుమ్మల మంత్రిగా ఉండటం తో మళ్లీ సీతారామ ప్రాజెక్ట్ పనులు పుంజుకున్నాయి.తన రాజకీయ జీవిత సాఫల్యం సీతారామ ప్రాజెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమేనని మంత్రి తుమ్మల పట్టుదల గా తీసుకున్నారు సీతారామ ప్రాజెక్ట్
సీతారామ ప్రాజెక్ట్ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే వరప్రదాయని.ప్రాజెక్ట్ కు ఎలా రూపకల్పన జరిగిందో చూస్తే తలాపునే గోదావరి పరవళ్లు తొక్కుతూ వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే మరోపక్క లక్షల ఎకరాలు సాగునీరు లేక బీడు బారగా,వర్షాధారంగా సాగు చేసే రైతులకు సాగు నీరు లేక కళ్లెదుటే చేతికందిన పంటలు ఎండిపోతుంటే,ఆరుగాలం రెక్కల కష్టం చమటోడ్చి సాగు చేస్తే తీరా పంట చేతికందక చేసిన అప్పులు ఎలా తీర్చేదనే బెంగతో రైతన్నలు ఉరి కోయ్యలకు వేలాడటం,పురుగు మందులు తాగి పొలంలోనే ప్రాణాలు తీసుకునే ఘటనలు ఎన్నో.నాడు తెలుగుదేశం పాలనలో జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు సాగు నీటి కోసం రైతుల కష్టాలు చూసి స్వయాన రైతు బిడ్డ, రైతైన తుమ్మల పదవులు శాశ్వతం కాదు పది తరాలు గుర్తుండేలా సాగు నీటి కష్టాలు తీర్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడానికి గోదావరి జలాలే శ్రీ రామరక్ష గా భావించి, నాడే సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసారు.కానీ నిధులు సమస్య తో ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాలేదు.
…కేసీఆర్ తో తుమ్మల సానిహిత్యం……సీతారామ ప్రాజెక్ట్ కు పునాది
…తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం జరిగి 2014 ఎన్నికల్లో తుమ్మల ఓటమి చెందారు.కానీ కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్ర అభివ్రుద్ది చెందాలంటే పాలన అనుభవం పరిపాలన దక్షత మెండుగా ఉండి,తనకు తుమ్మల ఎంతో ఆత్మీయుడవడంతో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తుమ్మల ను ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు.దాంతో తుమ్మల మంత్రిగా పదవులు కంటే ప్రజాప్రయోజనం కలిగే పనులు చేయాలనే సంకల్పంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో సాగునీటి కష్టాలు తీరాలంటే , బీడు బారిన భూముల్లో పచ్చని పంటలు పండాలంటే సాగు నీటి ప్రాజెక్ట్ ఎంతో అవసరమని,గోదావరి జలాలను లిఫ్ట్ చేసే ప్రాజెక్ట్ కు తుమ్మల తనకున్న అనుభవంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో గోదావరి జలాలను ఎలా కాల్వల్లో పారించాలో తుమ్మల ప్రతిపాదనలు చేసారు.సాగు నీటి ప్రాజెక్ట్ లతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్ తుమ్మల ప్రతిపాదనలకు ఆమోదం తెల్పి ప్రాజెక్ట్ పేరు ను శ్రీ రాముడు కొలువైన ప్రాంతం భద్రాచలం కావడంతో సీతారామ ప్రాజెక్ట్ గా కేసీఆర్ నామకరణం చేసారు.
……సీతారామ ప్రాజెక్ట్ కు 2016 పిభ్రవరి 16 న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసారు.గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న కాటన్ నిర్మాణం చేసిన దుమ్ముగూడెం ఆనకట్ట కు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీ ల సామర్ధ్యంతో భద్రాద్రి కొత్తగూడెం ,ఖమ్మం ,మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసారు.సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 టీఎంసీ ల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుండగా గోదావరి జలాలను లిఫ్ట్ చేసి స్టోర్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మాణం చేసారు.ప్రాజెక్ట కు శంకుస్థాపన జరిగి ఏడు సంవత్సరాలు అవుతున్నా ప్రాజెక్ట్ ఇంకా పూర్తవలేదు.
…కారణాలు చూస్తే గతంలో మంత్రిగా తుమ్మల ఉన్న సమయంలో వారానికి ఓ సారి ప్రాజెక్ట్ పనులను మానిటర్ చేసేవారు.కానీ 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమితో సీతారామ ప్రాజెక్ట్ కు నిర్లక్ష్యం గ్రహణం పట్టింది.
…..రేవంత్ క్యాబినెట్ లో మంత్రి గా తుమ్మల….సీతారామ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్
……..గత ఐదు ఏళ్లుగా నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రిగా అవకాశం రావడం తో తుమ్మల మళ్లీ సీతారామ ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ను సస్య శ్యామలం చేయాలనే పట్టుదలతో మంత్రి తుమ్మల ఉన్నారు.యుద్ద ప్రాతి పదికన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం కోసం అధికారుల తో రివ్యూ చేశారు.దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద పంఫ్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి రివ్యూ మీటింగ్ లో నిధుల సమస్య తో పాటు భూ సేకరణ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్….లింక్ కెనాల్స్….రైల్వే రోడ్ క్రాసింగ్ అంశాల పై సమీక్ష చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీ లను
*…పాలేరు లింక్ కెనాల్ పై అధికారులకు తుమ్మల దిశా నిర్దేశం..*
*……నత్తనడక సాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తవడంతో పాటు సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు పారేలా ,పాలేరు లింక్ కెనాల్ ను పూర్తి చేస్తే జిల్లా అంతటా సాగు నీటి కష్టాలు తీరి దశాబ్ధాల సాగు నీటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తుమ్మల వివరించారు.*
…..ఏన్కూరు రెగ్యెలేటర్ వరకు కాల్వలు పూర్తి చేస్తే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి,బోనకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వైరా మధిర నియోజకవర్గాలకు గోదావరి జలాలు పారేలా తుమ్మల సూచించారు. పాలేరు లింక్ కెనాల్ పూర్తి చేస్తే పాలేరు వరకు గోదావరి జలాలను తరలిస్తే పాలేరు రిజర్వాయర్ నుంచి వైరా రిజర్వాయర్ అక్కడ నుంచి సాగర్ ఎడమ కాల్వల ద్వారా గోదావరి జలాలు పొలాలకు అందుతాయి. సహజంగా గోదావరి కి జూన్ జులై నెలలో వరదలు వచ్చిన సందర్బంలో గోదావరి జలాలను లిఫ్ట్ చేసి పాలేరు వైరా రిజర్వాయర్ లను నింపొచ్చు.వానాకాలం పంటలకు ఏ ఇబ్బంది ఉండదు. నాగార్జున సాగర్ కు అగస్ట్ తరువాతే ప్రాజెక్ట్ నిండుతుంది.దాంతో వానాకాలం గోదావరి నీళ్లతో ,రబీ పంటలను సాగర్ నీళ్లతో పండే అవకాశం ఉండటంతో గోదావరి బేసిన్….. క్రుష్టా బేసిన్ మధ్య రెండు నదులు రెండు బేసీన్ల మధ్య రెండు పంటలు పండేలా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారనుంది.సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా సశ్య శ్యామలం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి….
మంత్రి తుమ్మల
అభినవ భగీరధుల్లా చరిత్రలో నిలిచిపోతారని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం ప్రసంశలు కురిపిస్తున్నారు..