బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. హైదరాబాద్ లో బిర్యానీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. నేరేడ్‌మెట్ గ్రీన్ బావర్చి హాటల్లో మంగళవారం రవి అనే యువకుడు చికెన్ బిర్యానీ తిన్నాడు. మంగళవారం గ్రీన్ బావర్చిలో బిర్యానీ తిన్న యువకుడు ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే విపరీతంగా వాంతులు చేసుకోగా కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బిర్యానీ తిన్న తర్వాతే ఫుడ్​ పాయిజన్​అయినట్లు వైద్యుల ద్వారా తెలియడంతో …

బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు..

హైదరాబాద్ లో బిర్యానీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. నేరేడ్‌మెట్ గ్రీన్ బావర్చి హాటల్లో మంగళవారం రవి అనే యువకుడు చికెన్ బిర్యానీ తిన్నాడు.

మంగళవారం గ్రీన్ బావర్చిలో బిర్యానీ తిన్న యువకుడు ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే విపరీతంగా వాంతులు చేసుకోగా కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

బిర్యానీ తిన్న తర్వాతే ఫుడ్​ పాయిజన్​అయినట్లు వైద్యుల ద్వారా తెలియడంతో సదరు యువకుడు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎక్స్​లో ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు గ్రీన్ బావర్చి రెస్టారెంట్లో తనిఖీలు చేశారు. బిర్యానీలో సింథటిక్​ కలర్స్​వాడుతున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. హోటళ్లలోని ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు టెస్టులకు పంపించారు.

Updated On 20 Nov 2024 10:07 AM IST
cknews1122

cknews1122

Next Story