HyderabadPoliticalTelangana

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ లు

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ లు

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ లు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియాని చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని ప్రకటించారు. ఇందులో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నారు.

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారిచేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డ్ ల లబ్ధిదారుల జాబిత కులగణన (సామిజిక) సర్వే ఆదారంగా తయారు చేసిందని ఇది తుది జాబితా కాదని పేర్కొంది.

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభల నిర్వహణ, తదితర అంశాలపై శనివారం నాడు డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలలో దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు లేదా కొత్త సభ్యుల చేర్పులకై దరఖాస్తులు కూడా స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే , గతంలో జరిగిన ప్రజాపాలన సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు.

ఈనెల 26 ప్రారంభించే నాలుగు పథకాలపై 21వ తేదీ నుండి ప్రారంభమయ్యే గ్రామసభల్లో ప్రజా అభిప్రాయలు/ ఫీడ్ బ్యాక్ లను తీసుకోవడంతో పాటు ఈ గ్రామ సభలు, ప్రజా పాలన సేవా కేంద్రాలలో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, MDO కార్యాలయంలో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను తగు రితీలో పరిశీలించిన తర్వాత మాత్రమే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని మంత్రులు స్పష్టం చేశారు.

అర్హులైన తుది జాబితాలను ప్రకటించడానికి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీచేయడం జరుగుతుందని తెలియ చేశారు.ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్న వారి జాబిత ఇంటి స్థలం లేని వారి రెండు జాబితాలను గ్రామ సభలలో ప్రదర్శించాలని, అలాగే కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని సూచించారు.

రాష్ట్రం లో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరికి గాను దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొన సాగుతుందని వారు స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతీ భూమికి రైతు భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు.

గతంలో వివిధ ప్రాజెక్టులకు, రహదారులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు తహసీల్దార్ల వద్ద ఉన్నాయని తెలిపారు.

వ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్దిదారులను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజుల పాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రతీ కుటుంబంలో మహిళల బ్యాంకు కాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్నిబదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో 156 గ్రామాలను మున్సిపాలిటీలలో కలపడం జరిగిందని, ఈ గ్రామాల్లో 2023 -24 లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణనలో తీసుకోవడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.

ఈనెల 21 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను సి.ఎస్ శాంతి కుమారి ఆదేశించారు. గతం లో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభల మాదిరిగానే 21 నుండి జరిగే గ్రామ సభలకు కూడా చేపట్టాలని అన్నారు.

ప్రతి రోజు ఒక గ్రామ పంచాయితీ లో మాత్రమే గ్రామ సభ నిర్వహించాలని, ఈ గ్రామ సభలకు హాజరయ్యే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!