
రాజీవ్ యువ వికాసం.. తొలి విడతలో ఎంత మందికి అంటే…!
రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతను అందిస్తుంది. స్వంతంగా బిజినెస్ లు ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్హులైన వారికి రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో వారు స్వయంగా వ్యాపారాలు ప్రారంభించవచ్చు.
2025లో మార్చి 15న రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 6వేల కోట్లతో ఈ పథకం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి 16 లక్షల మంది పైగా దరఖాస్తులు చేసుకున్నారు. జూన్ 2 తొలి విడత లక్ష మందికి రూ.50 వేలు, లక్షలోపు యూనిట్ల ప్రాసీడింగ్ ఇవ్వనుంది. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చి జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభత్సవాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు రూ.2 నుంచి 4 లక్షల యూనిట్లకు త్వరలో నిధులు కూడా మంజూరు చేయడానికి సన్నద్ధం అవుతోంది ప్రభుత్వం.
తెలంగాణ నిరుద్యోగ యువతకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. 18 నుంచి 35 ఏళ్లలోపు ఈ పథకానికి అర్హులు. వారి కుటుంబ ఆదాయం కూడా బీపీఎల్ కింద ఉండాలి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు మొదటి దశ విడుదల చేయనున్నారు.
ఈ పథకానికి ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే అర్హత.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఒకానొక సమయంలో సిబిల్ స్కోర్ ఆధారంగానే 24 మంజూరు చేస్తారని ఆరోపణలు వచ్చాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పథకానికి 80 శాతానికి పైగా మాత్రం రూ.4 లక్షల రుణం కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారట.