HyderabadPoliticalTelangana

కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం…

కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం…

కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం…

కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు ఇచ్చినట్లేనని కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ నేతలకు ఇదే నా హెచ్చరిక. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదించాలి.

లేకుంటే రైల్‌రోకోలు చేపడతాం’అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. బంజారాహిల్స్‌లో తన ఇంటి సమీపంలోనే జాగృతి కొత్త కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నేడు ఆమె ప్రారంభించారు. అనంతరం కవిత జై తెలంగాణ, జై జాగృతి అంటూ మీడియాతో మాట్లాడారు.

‘మైనార్టీల సమస్యలపైనా పోరాటం చేస్తాం. ఎస్సీ విభాగం ఏర్పాటుచేసి దళితుల సమస్యలపై పోరాడుతాం. మహిళలకు రూ.2,500 ఇస్తామన్నారు. అది సాధించే వరకు జాగృతి పోరాడుతుంది. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా.. నీళ్లు తరలించుకుపోతుంటే మాట్లాడటం లేదు. గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుంది. జాగృతి సంస్థను మరింత విస్తరిస్తాం’బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.

జాగృతి డిమాండ్లను గౌరవించిన కేసీఆర్ ‘ఎనిమిదేళ్ల కిందట జాగృతిని ప్రారంభించాం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి భాగమైంది. కేసీఆర్, జయశంకర్‌ స్ఫూర్తితో జాగృతి ఏర్పాటైంది. ప్రొ.జయశంకర్ నాకు దిశానిర్దేశం చేశారు అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ‘సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసింది. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారు. ఏం అడిగినా వెంటనే జీవోలు ఇచ్చేవారు’అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

‘ఆనాడు మేధావులు తెలంగాణ జాగృతి అని తన సంస్థకు పేరు పెడతామంటే వద్దన్నారని.. ముందు తెలంగాణ అని పేరు ఉంటే తొక్కేస్తారని అన్నారని గుర్తు చేశారు. కానీ ఆంధ్రా పాలకులను ఎదుర్కొని ధైర్యంగా తెలంగాణ జాగృతిని స్థాపించిన వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాం’అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ గొంతుకలా.. తలలో నాలుకలా జాగృతి నిలిచింది అని కొనియాడారు.

‘తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆడబిడ్డలా బోనం, బతుకమ్మను ఎత్తానని తెలిపారు. సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసిందని అన్నారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారని పేర్కొన్నారు. ఎప్పుడు ఏం అడిగినా వెంటనే జీవో ఇచ్చేవారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఉద్యమకారులపై గన్ తీసుకెళ్లిన వాళ్లు ముఖ్యమంత్రులుప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనికూడా అనలేదు అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులర్పించాలి. నివాళులర్పించనివారికి కుర్చీలో కూర్చునే అర్హతలేదు అని మండిపడ్డారు. ఉద్యమకారులపై గన్నుపెట్టినవారు ఇప్పుడు సీఎం అయ్యారు అంటూ ఎద్దేవా చేశారు.

రాజీవ్‌ యువ వికాసానికి అమరవీరుల పేరు పెట్టాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ‘ఉద్యమకారులపై గన్ తీసుకెళ్లిన వాళ్లు రాష్ట్రానికి సీఎం అయ్యారని కవిత ఫైర్ అయ్యారు. యువ వికాసం పథకానికి రాజీవ్ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటని కవిత ధ్వజమెత్తారు.

తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ’అని ఎమ్మెల్సీ కవిత నినదించాలని అన్నారు. నీళ్లు తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్న సీఎంనీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడటం లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.

బనకచర్ల ద్వారా చంద్రబాబు 200టీఎంసీలు తరలిస్తుంటే.. సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌ పని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. బీసీ బిల్లు గురించి సీఎం ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు.

‘బీజేపీ నేతలకు ఇదే నా హెచ్చరిక. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదించాలి. లేకుంటే రైల్‌రోకోలు చేపడతాం’అని ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో మైనార్టీల సమస్యలపైనా పోరాటం చేస్తాం. ఎస్సీ విభాగం ఏర్పాటుచేసి దళితుల సమస్యలపై పోరాడుతాం. మహిళలకు రూ.2,500 ఇస్తామన్నారు.

అది సాధించే వరకు జాగృతి పోరాడుతుంది. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా.. నీళ్లు తరలించుకుపోతుంటే మాట్లాడటం లేదు. గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుంది. జాగృతి సంస్థను మరింత విస్తరిస్తాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

కేసీఆర్‌పై ఈగ వాలినా సహించబోనుకాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీస్ ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ సమాజానికి ఇవ్వడమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 4వ తేదిన ధర్నా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఈగ వాలినా సహించబోను అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!