సత్తుపల్లిలో ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్
సత్తుపల్లి పాత సెంటర్లోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిత్తలూరి ప్రసాదును సస్పెండ్ చేశారు.
ఈ మేరకు డీఈఓ సోమశేఖరశర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలను గత నెల 18న ఎమ్మెల్యే మట్టా రాగమయి సందర్శించారు. ఆ సమయంలో పాఠశాలలో పిల్లలు లేకపోవటాన్ని గమనించారు.
విద్యార్థులు ఎందుకు రాలేదని ప్రశ్నించగా విద్యార్థులు క్రిందటి రోజు పిక్నిక్ కు వెళ్లారని, మరుసటి రోజు పాఠశాలకు రాలేదని బదులిచ్చారు.