
స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్
Web desc : అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి కోటేశ్వరరావు బిగ్బాధితుడిని రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న వెల్లడించారు.
ఇప్పటికే బాధితుడు రూ.20 వేల రూపాయలు చెల్లించగా, మిగిలిన రూ.15 వేల కోసం హెడ్ కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితుడు రఘునాథ ఆచారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు పన్నిన వలలో కోటేశ్వరరావు రూ.15 వేల లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
అయితే కానిస్టేబుల్ ఒకడేనా లేదా కానిస్టేబుల్ వెనక ఇతర పోలీస్ అధికారులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు.



