గాంధీ ఆస్పత్రి డాక్టర్లకు షోకాజ్ నోటీసులు

గాంధీ ఆస్పత్రి డాక్టర్లకు షోకాజ్ నోటీసులు;

By :  Ck News Tv
Update: 2025-03-08 06:17 GMT

గాంధీ ఆస్పత్రి డాక్టర్లకు షోకాజ్ నోటీసులు : దామోదర రాజనర్సింహా

హెల్త్ ​మినిస్టర్​ దామోదర రాజనర్సింహా ఇటీవల గాంధీ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా 27 మంది డాక్టర్లు గైర్హాజరు అయినట్టు గుర్తించామని, ఇందులో సమాచారం ఇవ్వకుండా ఆబ్సెంట్​అయిన 15 మందికి షోకాజ్​నోటీసులు ఇచ్చామని డీఎంఈ (డైరెక్టరేట్ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్) డా.నరేంద్రకుమార్​తెలిపారు.

Full Viewసదరు డాక్టర్లపై పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం ఆయన గాంధీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

క్యాజువాలిటీ, ఓపీ వార్డు, రేడియాలజీ డిపార్ట్ మెంట్ వార్డులను పరిశీలించారు. అటెండెన్స్​ను బయోమెట్రిక్​పద్ధతిలో తీసుకుంటున్నామని తెలిపారు. గాంధీలో ప్రస్తుతం ఐయూఐ పద్ధతిలో సంతాన సాఫల్య కేంద్రం సేవలు అందిస్తున్నామని వివరించారు.

జీరియాట్రిక్​వార్డు నడుస్తుందన్నారు.దవాఖాన ఆవరణలో మురుగు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Similar News