పారిశ్రామికవాడ కోసం భూములు ఇవ్వబోమని గిరిజన మహిళల నిరసన
పారిశ్రామికవాడ కోసం భూములు ఇవ్వబోమని గిరిజన మహిళల నిరసన;
By : Ck News Tv
Update: 2025-02-07 11:44 GMT
పారిశ్రామికవాడ కోసం భూములు ఇవ్వబోమని గిరిజన మహిళల నిరసన
దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకున్న ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం దుద్యాల మండలం లగచర్ల రోటి బండ తండా, పులిచెర్లకుంట తండాలో శుక్రవారం అధికారులు భూసర్వే చేపట్టారు.
భూసర్వే కోసం వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. పారిశ్రామికవాడ కోసం భూములు ఇవ్వబోమన్నారు. ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈక్రమంలో లగచర్ల, రోటిబండ తండాలో భారీగా పోలీసులు మోహరించారు.