నేటి నుంచి రైతు భరోసా నిధుల జమ: మంత్రి తుమ్మల
పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
జనవరి 26వ తేదీన రైతు భరోసా స్కీమ్ ను లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు కేవలం మండలానికి ఒక గ్రామానికి చొప్పున మాత్రమే పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేశారు. మిగతా గ్రామాల్లోని రైతులకు మాత్రమే భరోసా నిధులు రాలేదు. అయితే ఈక్రమంలోనే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల తాజా ప్రకటన చేశారు. దీంతో ఇవాళ్టి న…