మహిళ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
మహిళ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య;
మహిళ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కోహెడ మండలం వరుకొలు గ్రామానికి చెందిన మామిడాల అనూష (కీర్తి) 28 మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో విధులు నిర్వహిస్తూ బలవన్మరణానికి పాల్పడింది.
మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఈ సంఘటన జరిగింది. పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ, కుటుంబసభ్యులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం వర్గల్ గ్రామానికి చెందిన 2020 బ్యాచ ఏఆర్కానిస్టేబుల్ మామిడి అనూష(30) భువనగిరిలోని జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్లో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తోంది. స్థానిక విద్యానగర్లో మరో ఇద్దరు ఏఆర్కానిస్టేబుల్స్తో కలిసి అద్దె ఇంట్లో ఉం టోంది.
ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 14వ తేదీన వివాహ నిశ్ఛితార్థం చేసి, మార్చి 6వ తేదీన పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి ఆమె వివాహ సెలవులపై వెళ్లాల్సి ఉంది.
ఆమె నుంచి జవాబు రాకపోవడంతో డ్యూటీలో ఉండవచ్చునని భావించారు. పలుమార్లు ఫోన చేసినప్పటికీ సమాధానమివ్వకపోవడంతో అద్దె ఇంట్లో కలిసి ఉంటున్న మిగతా ఇద్దరికి ఫోన్లు చేయడంతో ప్రమాదంలో నాన్న గాయపడ్డాడని చెప్పి గదికి వెళ్లిందని సమాచారమిచ్చారు.
తనకు ప్రమాదమేమీ జరగలేదని, ఉదయం నుంచే ఫోన సమాధానమివ్వడంలేదని కుటుంబసభ్యులు పేర్కొనడంతో సహచర సిబ్బంది ఆమె గదికి వచ్చి కిటికీ నుంచి చూడగా ఫ్యానకు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. దీంతో తలుపులను బలవంతంగా తెరిచి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ అనూష సహచర ఉద్యోగుల వద్ద ఆవేదన వ్యక్తంచేసేదని తెలిసింది. అనూష తల్లి మామిడి పద్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.