![](https://cknewstv.in/wp-content/uploads/2024/05/n6084652161715666713730cf0163f33ade28c5e1a574078a527fbd0bf30bd465f609de8cfcc44428c65583.jpg)
ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం…
పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య టెన్షన్ లో ఉన్నారు.
![](https://cknewstv.in/wp-content/uploads/2024/05/IMG-20240408-WA0028.jpg)
శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. ఈ కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండా రన్ వే పై నిలిచిపోయింది విమానం.
ప్రయాణికుల్లో రెవిన్యూ శాఖామాత్యులు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.