
కుమార్తె పెళ్లి రద్దయిందని మనస్తాపంతో తండ్రి బలవర్మరణం..
Web desc : కుమార్తె పెళ్లి రద్దయిందని మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలోని హబీబ్ ఫాతిమానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన దుర్గం రవీందర్(50) కొన్నేళ్లుగా H.F.నగర్లో ఉంటున్నాడు.
మాదాపూర్ సైబర్ టవర్స్ వద్దనున్న గ్రీన్ కో సంస్థలో కేటరింగ్ పనిచేసేవాడు. గురువారం తెల్లవారుజామున ఇంటిపై ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కూతురి పెళ్లి రద్దయినందుకు తీవ్ర మనస్తాపంతో రవీందర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రవీందర్ కొడుకు అఖిల్ ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



